ఇఎస్ఐ సేవలు మరింత మెరుగు పరుస్తాం
NEWS Apr 11,2025 04:46 pm
ఇ.ఎస్.ఐ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేసారు. శుక్రవారం విజయవాడ ఇ.ఎస్.ఐ హాస్పిటల్ను సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్, లాబరేటరీ, ఇన్పేషెంట్, అవుట్పేషెంట్ విభాగాలను పరిశీలించారు. రోగుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుని, వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.