భూమునపై భగ్గుమన్న భాను ప్రకాశ్ రెడ్డి
NEWS Apr 11,2025 04:15 pm
టీటీడీపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు టీటీడీ బోర్డు సభ్యుడు బాను ప్రకాశ్ రెడ్డి. ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నారు. గతంలో తిరుమలలో జరిగిన అక్రమాలను బయట పెట్టారని కేసులు పెట్టిన చరిత్ర వైసీపీదన్నారు. ప్రతీకారం కోసం వైసీపీ పనిచేస్తే ప్రజల కోసం తమ కూటమి సర్కార్ పని చేస్తోందన్నారు. దమ్ముంటే తాను చేసిన సవాల్ ను స్వీకరించాలన్నారు.