బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు
NEWS Apr 11,2025 04:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది బీసీల సంక్షేమానికి రూ.48 వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఆదరణ-3 కింద బీసీలకు ఏటా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పథకాల అమలు విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని స్పష్టం చేశారు సీఎం.