అంగన్వాడీ సెంటర్లో చిరు ధాన్యాలపై అవగాహన
NEWS Apr 11,2025 04:00 pm
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ్లో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అంగన్వాడీ టీచర్ మమత ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఆహార వంటలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పవిత్ర, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.