గోశాలలో ఆవుల మృతి అబద్దం - టీటీడీ
NEWS Apr 11,2025 01:52 pm
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలోని గోశాలలో గోవులు మృతి చెందాయంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించింది. ఆవులు ఏ ఒక్కటి చని పోలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని పేర్కొంది. మృతి చెందిన గోవులు పోటోలు టిటిడి గోశాలకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది టీటీడీ, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవులు పోటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.