ఏపీపీఎస్సీ కార్యదర్శి గా రాజబాబు
NEWS Apr 11,2025 09:48 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా పి. రాజబాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కార్యాలయంలో ఆయన ఆసీనులయ్యారు. ఇటీవలే ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యదర్శిగా రాజబాబును నియమించింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పూర్తి పారదర్శకంగా జాబ్స్ ను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు పి. రాజబాబు.