పెట్టుబడిదారులకు ఏపీ ఎర్రతివాచీ
NEWS Apr 11,2025 08:57 am
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పర్యాటక విధానం 2024-29తో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. 30 కంపెనీలతో భేటీ అయ్యారు. ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 15 జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత హోటల్స్ గ్రూప్స్, ట్రావెల్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆస్కాట్, అకార్ హోటల్స్, వెల్ నెస్ రిసార్ట్స్ లో పేర్గాంచిన బెల్జియం కంపెనీ కొర్నెండాంక్, గ్రీన్ పార్క్ హోటల్స్, ఫెర్న్ హోటల్స్, యూఎస్ఏ కి చెందిన వైల్డ్ ఫ్లవర్ హోటల్స్,బ్రిగేడ్ హోటల్స్, వెల్ నెస్ బ్రాండ్ అయిన ఎలెనా తదితర హోటల్స్ గ్రూప్స్ ప్రతినిధులతో చర్చించారు.