సీతారాముల కళ్యాణోత్సవం సర్వం సిద్దం
NEWS Apr 11,2025 07:35 am
ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం సీతా రాముల కళ్యాణోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని టీటీడీ అంచనా వేస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అన్న ప్రసాదం, నీళ్లు, మజ్జిగ, మజ్జిగ, తలంబ్రాల ప్యాకెట్లు సిద్దం చేసినట్లు తెలిపారు.