చెలరేగిన రాహుల్ తలవంచిన బెంగళూరు
NEWS Apr 11,2025 07:01 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో స్వంత గడ్డపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హర్షల్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఆర్సీబీకి చుక్కలు చూపించింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఒకానొక దశలో 4 వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గలేదు. ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టాడు. కళ్లు చెదిరే షాట్స్ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరింది. 53 బంతులు ఎదుర్కొని రాహుల్ 93 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకు స్టబ్స్ తోడుగా ఉన్నాడు.