పసునూరి శ్రీనివాస్ కు సన్మానం
NEWS Apr 11,2025 01:37 pm
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పసునూరి శ్రీనివాస్ ను మెట్ పల్లి పట్టణం దుబ్బవాడకి చెందిన 21 వార్డు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పద్మశాలి సమాజానికి చెందిన న్యాయవాది శ్రీనివాస్ న్యాయవాదుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షులు భీమానతి సత్యనారాయణ, నాయకులు అందె ఉదయ్ కుమార్, చిలుక లక్ష్మణ్, పోతు రామ్ దాస్, భీమానతి ప్రకాష్, చంద్రకాంత్, బాస రవి, పాల్గొన్నారు.