ప్రతి సమస్యనూ పరిష్కారిస్తాం
NEWS Apr 10,2025 04:47 pm
ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రజాదర్బార్ నిర్వహించారు. అర్జీదారులను నేరుగా కలిసి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి గోడు వింటూ, వినతులు స్వీకరించారు. హోంశాఖకు సంబంధించిన సమస్యలపై అప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులను పరిష్కారం దిశగా ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా వింటూ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల కోసం తన కార్యాలయం ద్వారాలు తెరిచే ఉంటాయని , ఎప్పుడైనా కలిసి సమస్యలను తన దృష్టికి తీసుకు రావచ్చని వెల్లడించారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు