చోరీకి గురైన వంద మొబైల్ ఫోన్ల రికవరీ
NEWS Apr 10,2025 04:49 pm
MBNR: జిల్లా కేంద్రంలో చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు ఆ మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జానకి ధరావత్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా పోలీసులు ఎంతో నిబద్ధతతో పనిచేసి మొబైల్ ఫోన్లు రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ సీఐ ఐజాజుద్దీన్ పాల్గొన్నారు.