మన దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది
NEWS Apr 10,2025 02:52 pm
మన దేశ ఫ్యూచర్ తరగతి గదిలో దాగి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నియోజక వర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో క్యాంపస్ లో 2 వేల మంది విద్యార్థులు చదువు కోవచ్చన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, యూనివర్సిటీ లకు ధీటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఉంటాయని చెప్పారు. ఒక్కో క్యాంపస్ రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు.మొత్తం 58 స్కూళ్లకు బడ్జెట్ లో రూ.11,500 కోట్లను కేటాయించామన్నారు.