తిరుమలలో కళ్యాణ్ రామ్..విజయశాంతి
NEWS Apr 10,2025 01:53 pm
హీరో నందమూరి కళ్యాణ్ రామ్, నటి, ఎమ్మెల్సీ విజయశాంతి గురువారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సందర్బంగా సినిమా విజయవంతం కావాలని స్వామి , అమ్మ వార్లను ప్రార్థించినట్లు చెప్పారు విజయశాంతి, కళ్యాణ్ రామ్. ఇటీవలే తను కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.