పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్
NEWS Apr 10,2025 06:34 pm
హనుమాన్ జయంతి పురస్కరించుకొని గోల్ హనుమాన్ మందిరం పరిసరాల్లో, కాశి బాగ్ హనుమాన్ టెంపుల్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మోహన్ పర్యవేక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి రోజు పట్టణంలోని అన్ని హనుమాన్ ఆలయ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని అన్న ప్రసాదం జరిగే ఆలయాల్లో వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు అందించాలని, ఆలయ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.