ఒలెక్ట్రా కంపెనీకి 297 బస్సుల ఆర్డర్
NEWS Apr 10,2025 08:49 am
భారతదేశంలో ఎలక్ట్రిక్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి తొమ్మిది మీటర్ల పొడవైన 297 నాన్-ఎయిర్ కండిషన్డ్ (నాన్-ఎసి) బస్సుల ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ పొందింది. ఒలెక్ట్రా అధికారికంగా హె చ్ ఆర్ టీ సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మురారి లాల్ నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LOA)ని అందుకుంది. ఈ ఆర్డర్ ద్వారా సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒక రోడ్ రవాణా సంస్థ ఇన్ని ఎలక్ట్రిక్ బస్సులను నేరుగా కొనుగోలు చేయటం దేశంలో ఇదే ప్రథమం.