గుజరాత్ టైటాన్స్ జోరు రాజస్థాన్ బేజారు
NEWS Apr 10,2025 07:57 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 18వ సీజన్ లో టాప్ లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించింది. 58 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. కెప్టెన్ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 217 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ ఉతికి ఆరేశాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 82 రన్స్ చేయగా బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 రన్స్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 159 పరుగులకే పరిమితమైంది. శాంసన్, సిమ్రోన్ హిట్ మైర్ మినహా ఏ ఒక్కరూ ఆడలేదు.