అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
NEWS Apr 10,2025 08:16 am
విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర చేపట్టారు. పట్టణమంతా కాషాయమయంగా మారింది. ఈ యాత్రను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. హనుమాన్ దీక్షా పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.