గోదామును జాగ్రత్తగా పరిరక్షించండి
NEWS Apr 10,2025 08:21 am
WNP: జిల్లాలోని ఈవీఎం గోదాము పరిరక్షణ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఈవీఎం గోదాము నెలవారీ తనిఖీలో భాగంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. నిరంతర నిఘాకు ఎంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు అడిగి, రిజిస్టరును పరిశీలించారు.