అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఎమ్మార్వో
NEWS Apr 09,2025 06:13 pm
మేడిపల్లి:- భీమరంలో 1308 సర్వే నంబర్ లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించి భూములను ఎమ్మార్వో రవి కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్, రెవిన్యూ సిబ్బంది జెసిబితో పలు ప్రాంతాల్లో నిర్మించిన రేకుల షెడ్లు భవనాలను నెలమట్టం చేశారు. ఎవరైనా మున్ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు, న్యాయపరమైన కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవి కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్యామ్ , రామ్ పాల్గొన్నారు.