ఏపీలో ప్రజల వద్దకు పాస్ పోర్ట్ సేవలు
NEWS Apr 09,2025 01:33 pm
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మొబైల్ పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అధికారులు నలుగురు సిబ్బందితో కూడిన పాస్ పోర్ట్ సేవా మొబైల్ వ్యాన్ ను సిద్దం చేశారు. పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లలేని వారు , మారుమూల ప్రాంత ప్రజలు ఊరిలోనే ఉంటూ , ఈ వ్యాన్ సాయంతో పాస్ పోర్ట్ పొందవచ్చు. వ్యాన్ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్సైట్లో పేర్కొంటారు. ప్రక్రియ పూర్తయ్యాక పాస్ పోర్టును ఇంటికే పంపిస్తారు.