బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలింపు
NEWS Apr 09,2025 04:29 pm
బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టం గా ఏప్రిల్ 27 హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో రజతోత్సవ మహాసభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఎండపల్లి మండలం నుంచి 500 నుంచి 700 మంది వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తెలిపారు.