11న ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి సీఎం
NEWS Apr 09,2025 08:18 am
ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈనెల 11న కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఒంటిమిట్టను సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ , తదితరులు ఉన్నారు.