శ్రీ సీతారామ లక్ష్మణుల అభయం
NEWS Apr 09,2025 08:05 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.