లబ్ధిదారుడు ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం
NEWS Apr 09,2025 07:55 am
MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు గోపాల్ ఇంట్లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకు రావడం జరిగిందని, ప్రజలంతా కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని తీసుకోవాలన్నారు.