క్రికెట్లో ఆ రూల్ మార్చాలి
NEWS Apr 08,2025 03:22 pm
క్రికెటర్ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి బంతికి అంపైర్ ఔట్ ఇచ్చినా బ్యాట్స్మెన్ పరుగు తీశారు. రివ్యూలో నాటౌట్గా తేలినా ఆ రన్ను లెక్కలోకి తీసుకోక పోవడంపై విహారి స్పందించాడు. ఈ నిబంధనల్లో మార్పు తీసుకురావాలని ఎక్స్ వేదికగా కోరాడు.