నిరూపిస్తే మీ ఇంట్లో గులాంగిరీ చేస్తా
NEWS Apr 08,2025 12:52 pm
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 వేల ఎకరాల అటవీ భూమిని తాను ఆక్రమించుకున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే తాను మీ ఇళ్లల్లో గులాంగిరి చేస్తానని ప్రకటించారు. ఇకవేళ మీరు నిరూపించ లేక పోతే తన ఇంట్లో మీ ఇద్దరూ పని చేయాలని స్పష్టం చేశారు కడియం. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.