కుమారుడికి గాయం పవన్ ప్రయాణం
NEWS Apr 08,2025 09:38 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మన్యం టూర్ ను రద్దు చేసుకున్నారు . హుటా హుటిన సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ తన చిన్నకుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. స్కూల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొడుకు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురయ్యారు పవన్ కళ్యాణ్.