పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్
NEWS Apr 08,2025 08:31 am
ఐపీఎల్ 2025 లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి దాకా పోరాడింది ముంబై ఇండియన్స్. ఆర్సీబీ అద్భుత విజయాన్ని సాధించింది. మరోసారి సత్తా చాటాడు విరాట్ కోహ్లీ. 42 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 67 రన్స్ చేశాడు. కెప్టెన్ రజిత్ పాటిదార్ దుమ్ము రేపాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 64 రన్స్ చేశాడు. జితేశ్ శర్మ 19 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 ఫోర్లు 4 సిక్సర్లతో 40 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 రన్స్ చేసింది ఆర్సీబీ. ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 209 రన్స్ మాత్రమే చేసింది. తిలక్ వర్మ 56 , హార్దిక్ పాండ్యా 42 చేసినా ఫలితం లేకుండా పోయాయి. కృనాల్ పాండ్యా బౌలింగ్ తో ముంబైని శాసించాడు.