సన్న బియ్యంతో పేదలు సంతోషం
NEWS Apr 08,2025 08:23 am
సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బోనస్ ప్రకటించడంతో రైతులు వరి సాగు చేసే పనిలో పడ్డారని అన్నారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు చేశామన్నారు. ప్రతి రేషన్ షాప్ నకు పంపిస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని తమ సర్కార్ చేసిందన్నారు. గతంలో లాగా ఇప్పుడు రేషన్ బియ్యం పక్కదారి పట్టడం జరగదన్నారు. తాము ప్రజా పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.