గచ్చిబౌలి భూముల వ్యవహారంపై పిటిషన్
NEWS Apr 08,2025 07:35 am
హైదరాబాద్ లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన కంచె గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూముల వ్యవహారంపై ప్రభుత్వం మేల్కొంది. కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు.