జై భీమ్ హమాలీ సంఘం కమిటీ ఎన్నిక
NEWS Apr 08,2025 10:53 am
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి అమిస్తాపూర్లో జై భీమ్ హమాలీ సంఘం నూతన కమిటీని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కురుమూర్తి అధ్యక్షతన ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా ఖాదర్, ఉపాధ్యక్షుడిగా నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా యాదయ్యను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు రూ. 10 లక్షల భీమా, 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ. 5,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.