మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి హౌజ్ అరెస్ట్
NEWS Apr 07,2025 07:25 pm
కుర్నూల్ జిల్లా కల్లూరు మండలం కొంగనపాడులో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల వారి రథోత్సవానికి హాజరు కాకుండా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని మండిపడ్డారు. రథోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే చరిత రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరూ ఒకే సమయంలో పర్యటిస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు పోలీసులు.