దోమల వ్యాప్తిని పూర్తిగా నియంత్రించాలి
NEWS Apr 07,2025 05:29 pm
దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా వ్యాధి నివారణాధికారి నక్కా వెంకటేశ్వరరావు సూచించారు. సోమవారం ఆలమూరు మండలం జొన్నాడ ఇటుక బట్టీలను, పెదపళ్ళ పీహెచ్సీని ఆయన పరిశీలించారు. దోమల వ్యాప్తిని నివారించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పటికప్పుడు జ్వర సర్వే నిర్వహించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులతో అన్నారు.