పెట్రో ధరల పెంపుపై ఖర్గే ఫైర్
NEWS Apr 07,2025 04:59 pm
కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర 41 శాతం తగ్గిందని, అయినా మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి బదులు.. మీ దోపిడీ ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ.2 పెంచడం దారుణమన్నారు.