3 వేల ఆర్టీసీ బస్సులు కావాలి
NEWS Apr 07,2025 03:12 pm
ఈనెల 27న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు 3000 ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కోరారు పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, కురువ విజయ్ కుమార్. బస్ ల అద్దె కోసం రూ. 8 కోట్ల చెక్ ను ఎండీ సజ్జనార్ కు అందజేశారు.