గచ్చిబౌలి భూ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా
NEWS Apr 07,2025 02:29 pm
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదానికి సంబంధించి హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, 16న తుది తీర్పు వెలువరిస్తామని పేర్కొనడంతో ఈనెల 24 న విచారణ చేస్తామని తెలిపింది కోర్టు. కౌంటర్, రిపోర్ట్ వెంటనే సమర్పించాలని ఆదేశించింది. కాగా ఈ భూములను వేలంపాట వేసి అమ్మాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.