44వ రోజుకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
NEWS Apr 07,2025 02:01 pm
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం నాటితో 44వ రోజుకు చేరుకుంది. రెస్క్యూ లో 12 బృందాలు, 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 30 మీటర్ల పరిధిలో డేంజర్ జోన్ గా కంచె ఏర్పాటు చేశారు. భారీగా ఊట నీరు వస్తుండడంతో ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఊట నీటిని భారీ మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ సూచనల మేరకు టన్నెల్ తవ్వకాలు చేపట్టారు. ఇనుము శిథిలాలను కట్ చేయడంలో కీలక పాత్రో పోషిస్తున్నారు రైల్వే సిబ్బంది.