విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ
NEWS Apr 07,2025 01:29 pm
MBNR: మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. విద్యార్థులు స్వచ్ఛభారత్, బాల్య వివాహాలు, వరకట్నం, ఎయిడ్స్, నీటి ఆవశ్యకత, బాల కార్మికులు, చెట్లను పెంచడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ..విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ అలవాటు పడేలా ప్రజల భాగస్వామ్యంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవలందిస్తున్నారన్నారు.