మోదీపూర్ లో సన్న బియ్యం పంపిణీ
NEWS Apr 07,2025 01:29 pm
MBNR: కోయిలకొండ మండలం మోదీపూర్ గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రమేశ్ ఈరోజు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాలునాయక్, కార్యదర్శి బుగ్గయ్య, శ్రీనివాసులు, వెంకట రాములు, తదితరులున్నారు.