శ్రీరామ నవమి శోభ యాత్ర ఊరేగింపు
NEWS Apr 06,2025 02:28 pm
శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా హైదరాబాద్ లో ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో శోభ యాత్ర చేపట్టారు. ఈ ఊరేగింపు సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైంది. సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగియనుంది. శోభ యాత్ర సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ధూల్ పేట, పురాణాపూల్ చౌరస్తా, జుమెరాత్ బజార్ , బేగంబజార్ ఛత్రి, గోల్ మసీద్ , గౌలిగూడ గురుద్వారాలో ప్రసంగించనున్నారు.