విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ మద్దతు
NEWS Apr 06,2025 02:17 pm
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు. ఆదివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఆ 400 ఎకరాలు పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినవేనని అన్నారు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. పర్యావరణవేత్తల పేషన్ కి సెల్యూల్ చేస్తున్నానని చెప్పారు. ప్రజలు కూడా ఈ న్యాయమైన ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు కేటీఆర్.