ఢిల్లీ క్యాపిటల్స్ జోర్దార్ చెన్నై బేజార్
NEWS Apr 05,2025 07:21 pm
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ను 25 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. అనంతరం 184 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై కేవలం 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ అద్బుతంగా ఆడినా , చివరకు ధోనీ మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది.