సన్న బియ్యం పథకం కాదు పేదోడికి వరం
NEWS Apr 05,2025 06:48 pm
సన్న బియ్యం పథకం కాదని అది పేదోళ్లకు వరం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వచ్చే ఐదేళ్లు కూడా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తోందని చెప్పారు. ఇది పేదోడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే కార్యక్రమం అని అన్నారు మంత్రి. అన్ని పథకాలు ఒకవైపు అయితే సన్న బియ్యం పంపిణీ అనేది మరోవైపు అంటూ పేర్కొన్నారు.