దరఖాస్తులు మున్సిపాలిటీలో సమర్పించాలి - కమిషనర్
NEWS Apr 05,2025 01:24 pm
తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలు కోసం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మీ సేవలో ఆన్లైన్ చేసిన దరఖాస్తులు మున్సిపాలిటీలో సమర్పించాలని మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తు ఫారంకు సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకొని రావాలని అన్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగుస్తున్నట్లు పేర్కొన్నారు.