యూనివర్శిటీ వివాదంపై మీనాక్షి సమావేశం
NEWS Apr 05,2025 11:15 am
రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూముల వివాదంపై ఆమె చర్చించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీతో సమావేశం అవుతారు. సమస్య గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. వీరితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు.