రేపు పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం
NEWS Apr 05,2025 08:25 am
తమిళనాడులోని రామనాథపురంలో రూ.535 కోట్లతో నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రామేశ్వరాన్ని రైల్వే మార్గం ద్వారా అనుసంధానించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు దీనిని. ఆదివారం దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా మోదీ ఈ వంతెనను ప్రారంభించి..జాతికి అంకితం ఇవ్వనున్నారు.