కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు
NEWS Apr 05,2025 04:42 am
మాజీ మంత్రి మైసూరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. కేవలం సోనియా గాంధీ దయ వల్లనే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెద్దమొత్తంలో అప్పులు, అభివృద్ధి కార్యక్రమాలు చేయక పోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడన్నారు. అదే దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నిత్యం ప్రజలతో కలిసేవారని అన్నారు.