లబ్దిదారుల ఇళ్లల్లో భోజనం చేయాలి
NEWS Apr 05,2025 02:54 am
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లబ్దిదారుల ఇళ్లల్లోకి ప్రజా ప్రతినిధులు వెళ్లాలని, అక్కడ సహ పంక్తి భోజనం చేయాలని సూచించారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని తీసుకు వచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. శ్రీ రామనవమి రోజున భద్రాచలంలో లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం చేస్తారన్నారు. సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం అన్నారు.