ఆంజనేయ భక్తులకు నీళ్ల బాటిళ్లు పంపిణీ
NEWS Apr 05,2025 09:59 am
ముస్లిం సోదరులు తమ ఉదారతను చాటుకున్నారు. జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు హ్యాంగ్ ఔట్ హోటల్ వద్ద హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులకు మంచి నీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు నాఫిసియా మసీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ ఖురేషి. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, రహ్మత్పుర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.